- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పల్లెల్లో మొదలైన పండగ వాతావరణం.. కిక్కిరిసిన బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు

దిశ, వెబ్డెస్క్: నేటితో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకు రాజకీయ నాయకుల్లో కనిపించిన ఎన్నికల హడావిడి తగ్గిపోయింది. కాగా ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి ఏర్పడింది. జనాలు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో వేలాది మంది జనం తరలివెళ్తుండటంతో బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా మారిపోయాయి. చాలా మంది రిజర్వేషన్ దొరక్కపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మరికొంతమంది తమ సొంత వాహనాలతో బయల్దేరుతున్నారు. ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ పెద్ద ఎత్తున టికెట్స్ ధరలను కూడా పెంచేశాయి. దీంతో అధికారులు ఈ సమస్యను గమనించి చర్యలు తీసుకోవాలని, ఎన్నికల కోసం బస్సులు మరిన్ని పెంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఎన్నికల వేళ నగరంలో స్థిరపడ్డ వారంతా ఊర్లకు తరలివెళ్తుండటంతో గ్రామాల్లో ఒక్కసారిగా పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.